ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2019, 06:04 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన వైసీపీ అధినేత జగన్ 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ప్రమాణస్వీకార వేదికగా ఖరారు చేశారు. 30న ఉదయం 11.40 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రమాణం చేయనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు, జనం హాజరుకానున్నందున భద్రతాఏర్పాట్లపై ఇప్పటికే జగన్‌తో ఏపీ డీజీపీ ఠాకూర్ చర్చించారు. శుక్రవారం తాడేపల్లిలోని నివాసంలో జగన్‌తో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై చర్చించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com