వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో వైకాపా విజయఢంకా మోగించడంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం తాడేపల్లి నుంచి గన్నవరం వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక వాహన శ్రేణిలో రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్ వద్ద ఆయనకు వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భారీ విజయం సాధించి రాజ్భవన్కు చేరుకున్న జగన్కు గవర్నర్ అభినందించారు. అనంతరం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు పరిపాలనా అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ నెల 30న ప్రమాణస్వీకారోత్సవానికి జగన్ ముహూర్తం ఖరారు చేసుకున్న నేపథ్యంలో గవర్నర్ను ఆహ్వానించనున్నారు.