తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని వైఎస్.జగన్ ప్రధాని మోడీని కోరేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం.12 గంటలకు ప్రధాని మోదీతో జగన్ ల సమావేశానికి పిఎంఓ అపాయింట్మెంట్ ఇచ్చింది. జగన్తో పలువురు వైసిపి నేతలు, విజయసాయిరెడ్డి, కొత్తగా ఎంపికైన పార్లమెంటు సభ్యులతో పాటు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఢిల్లీకి వెళ్లే బృందంలో ఉంది. వాస్తవానికి ఆదివారం ఇడుపులపాయ పర్యటనలో వైఎస్కు నివాళులర్పించి, కడప దర్గాలో రంజాన్ వేడుకలలో జగన్ పాల్గొనాల్సి ఉంది. ప్రధాని కార్యాయం నుంచి వచ్చిన అపాయింట్ మెంట్ మేరకు ఈ పర్యటనని రద్దు చేసుకున్నట్టు సమాచారం. దీంతో ఈ నెల 29న జగన్ ఇడుపులపాయకు వెళ్లే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలలో వినవస్తోంది.