కర్నూలు జిల్లా కురిసిన వర్షాలు అక్కడి రోజువారి కూలీలకు అదృష్టాన్ని కురిపించాయి. వివరాలలోకి వెళితే జిలా్లలోని జొన్నగిరి చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షం వచ్చిందంటే ఇక్కడి భూమిలోని వజ్రాలు బైటకు వస్తాయని ప్రజలు నమ్ముతారు. భూమిలో పాతుకుపోయిన వజ్రాలు వర్షాలు కురిసే సమయంలో బయటకు కనిపిస్తుంటాయి. ప్రతీ వర్షాకాలంలోనూ ఈ ప్రాంతం జాతరను తలపిస్తుంటుంది. జనం నమ్మకం వమ్ముకాకుండా వజ్రాలు దొరికిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
తాజాగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి స్థానికులతోపాటు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఇక్కడికి జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలకు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. వీటిని స్థానిక వ్యాపారులు ఒక వజ్రాన్ని రూ.1.10 లక్షలకు కొనుగోలు చేయగా, నాణ్యత తక్కువగా ఉన్న మరో వజ్రాన్ని రూ.30 వేలకు కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది.