తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 79,957 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లు.