ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాబూల్‌లో బాంబ్‌ బ్లాస్ట్

international |  Suryaa Desk  | Published : Fri, May 24, 2019, 04:37 PM

రంజాన్ పవిత్ర మాసం వేళ ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లో ఉన్న ఓ మసీదు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మత గురువు(ఇమామ్) మృతి చెందగా.. మరో 16మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన సమయంలో ఈ పేలుడు జరిగింది. ప్రార్థనల కోసం మత గురువు ఉపయోగించే మైక్రోఫోన్‌లో బాంబును అమర్చినట్లు జిల్లా పోలీస్ అధికారి జాన్ అఘా వెల్లడించారు. కాగా ఇది తమ పనేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. అయితే తాలిబన్లు, ఐసిస్ ఉగ్రవాదులు తరచుగా అక్కడ దాడులు జరుపుతుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com