ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి కోవింద్‌ను కలవనున్న మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, May 24, 2019, 04:21 PM

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం కలవనున్నారు. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కోవింద్‌తో మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామాను రాష్ట్రపతికి మోదీ సమర్పించనున్నారు. మోదీ రాజీనామాను ఆమోదించిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించనున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 353, యూపీఏకు 92 స్థానాలు రాగా, ఇతరులు 97 స్థానాల్లో గెలుపొందారు. 2014లో వారణాసి నుంచి గెలుపొందిన మోదీ.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు 353 స్థానాలు రావడంతో.. రెండోసారి మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com