ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చేతిలో కాంగ్రెస్ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ 49 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాషాయ సునామీలో కాంగ్రెస్ దిగ్గజాలు రాహుల్గాంధీ, జోతిరాదిత్య సింథియా, దిగ్విజయ్ సింగ్ వంటివారు తుడిచిపెట్టుకుపోయారు. ఓటమికి గల కారణాలు, తదుపరి కార్యచరణ వంటి పలు అంశాలపై రేపటి భేటీలో నేతలు చర్చించనున్నారు.