ఏపి అసెంబ్లీ ఎన్నికలలో జనసేన ఓటమిపై జబర్ధస్ట్ నటుడు ఆది స్పందిస్తూ ‘మద్యం… డబ్బు ముందు మానవత్వం చచ్చిపోయింది’ అంటూ ట్వీట్లు గుప్పించాడు. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ప్రగల్బాలు పలికిన కమెడియన్ హైపర్ ఆది.. ఎన్నికల ఫలితాల అనంతరం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ. జనసైనికులకు సారీ… మనం రెండు చోట్లా ఓడిపోయాం’… ‘ఈరోజు ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు… తెలుగు ప్రజలు… ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో బ్లాక్ డే’… అంటూ ఎమోషనల్ గా అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఆది కామెంట్లపై జనసేన వర్గాలలో కూడా ఆక్షేపణ వ్యక్తమవుతోంది.