ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు, లోకేష్ల నుంచి తెలుగు దేశం పార్టీని కాపాడుకోవాలన్నారు కొడాలి నాని. శుక్రవారం తన నివాసంలో ఆయన మీడియాలో మాట్లాడుతూ నీచ రాజకీయాలు చేయటంలో చంద్రబాబు సిద్దహస్తుడని, అందుకు అనుగుణంగానే హరికృష్ణ కుమార్తెను, దేవినేని అవినాష్ను రాజకీయంగా బలిపశువులను చేశారని వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులున్నా పార్టీని నిబద్ధతతో నడిపారు కనుకనే జగన్ విజేత కాగలిగారని, జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పుతానన్న చంద్రబాబు, పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించి ఇక ఇంటికే పరిమితమైతే మంచిదని సలహా ఇచ్చారు. లేదంటే ఏదో ఒకరోజు తెలుగుదేశం పార్టీని కార్యకర్తలే చేతుల్లోకి తీసుకుని బాబుని, లోకేష్ని తన్ని తరిమేస్తారని జోస్యం చెప్పారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని .