వివాదరహిత ఎమ్మెల్యేగా పనిచేస్తూ, నిత్యం జనం మధ్యే ఉంటూ తను ఇచ్చిన హామీలను అమలు చేయటానికి కృషి చేయటం ద్వారా తన సొంత ఛారిటీతో సంక్షేమ కార్యక్రమాలతోప్రజల్లో చెరగని ముద్ర వేయటం ద్వరా గ్దే రామ్మోహన్ మరోమారు విజయతీరాలు చేరుకున్నారన్నది వాస్తవం. ప్రజలను రక్షించటానికి ఎన్నో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రీటైనింగ్ వాల్ పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు . కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయటం వల్ల గద్దెను ఓటర్లు ఆదరించారు. జిల్లాలో ఫ్యాన్గాలి బలంగా వీస్తున్నా తనని వ్యతిరేకించిన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీలో చేరినప్పటికీ గతం కంటే రెట్టింపు సంఖ్యలో ఈసారి గద్దెకు మెజారిటీ రావడం విశేషం. 15వేల పైచిలుకు మెజారిటీతో ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్పై ఆయన విజయం సాధించిన విషయం విదితమే.