విశాఖ మన్యంలో మరో వెలుగు రేఖ పొడిచింది. కేంద్ర మంత్రిగా పని చేసిన కిశోర్చంద్రదేవ్ లాంటి రాచ బిడ్డను కాదని, గిరిజన నియోజకవర్గం అడవిబిడ్డకే అండగా నిలచింది. తన అనుచరులతో వెళ్లి కలిసిన రోజే మాధవికి అరకు ఎంపీ టికెట్ ఇస్తానని వైసిపి అధినేత జగన్ హామీ ఇచ్చినా, ఆమె మనసంతా పాడేరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరింది. అయినా అధిష్ఠానం ఎంపీ టికెట్ కేటాయించి, భరోసా ఇవ్వటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఆత్మ విశ్వాసమే ముందుకు సాగింది. సీనియర్ రాజకీయ నేత ముందు మాధవి ఎంత వరకు నెగ్గుకు రాగలరని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మాధవి ఎంపీగా విజయం సాధించారు.