మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంట్లో మోడీని నిలదీసిన గొంతుక మళ్లీ పార్లమెంటులో అడుగు పెట్టబోతోంది. గుంటూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి గల్లా జయదేవ్ మరోమారు విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో గెలుపు దోబూచులాటల నడుమ ఆయన వైకాపా అభ్యర్థి వేణుగోపాల్రెడ్డిపై 4800 ఓట్ల తేడాతో గెలుపొందారు.