ఏపీ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ అధ్యక్షుడు జగన్కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలియచేస్తున్నట్లు..కేంద్రంలో నరేంద్ర మోడీ గెలవడం..బీజేపీకి శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.
ఒడిశాలో గెలుపొందిన నవీన్ పట్నాయక్కు విషెష్ తెలుపుతున్నట్లు తెలిపారు. టీడీపీ విజయానికి కృషి చేసిన వారందరికీ, పార్టీకి ఓట్లు వేసిన వారికి అభినందనలు అని తెలిపారు. ఫలితాలను స్టడీ చేసి..మున్ముందు ఎలా వెళ్లాలో ఆలోచిస్తామన్నారు బాబు.. ప్రస్తుతం ఏమీ మాట్లాడమని చెప్పి వెళ్లిపోయారు.
ఏపీలో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన అధిక్యం కనబరిచింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 148 స్థానాల్లో వైసీపీ, 26 స్థానాల్లో టీడీపీ, జనసేన 01 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 25 లోక్ సభ స్థానాల్లో వైసీపీ 22, టీడీపీ 03 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. పార్టీ పరాజయం దృష్ట్యా సీఎం పదవికి బాబు రాజీనామా చేశార. ఫ్యాక్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్కు పంపారు. ఈ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మే 30వ తేదీన సీఎంగా జగన్ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.