ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 30న ప్రమాణస్వీకారం..: వైఎస్ జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2019, 07:38 PM

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో గొప్ప విజయం అందించిన ప్రజలకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల వెల్లడి అనంతరం తాడేపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగిస్తూ.. అద్భుత విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం దేవుడి దయ, ప్రజల దీవెనలతో సాధ్యమైంది. 175 అసెంబ్లీ సీట్లకు గాను 150 స్థానాలు గెలవడం చరిత్రత్మాక విజయం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. ప్రజలు ఓటేశారు అంటే అది విశ్వసనీయతకు ఓటేశారు. ఈ విజయం నా మీద ఉన్న బాధ్యత, విశ్వాసం మరింత పెంచుతుంది. ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు నాపై బాధ్యత పెంచారు. 5 కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే దేవుడు అవకాశం ఇస్తారు. ఆ అవకాశం వచ్చింది.. సుపరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తా. 6 నెలల నుంచి ఏడాదిలోపే జగన్ మంచి సీఎం అని మీరంతా అనేలా చేస్తా. నా ప్రతి అడుగు మీరు ప్రశంసించేలా ఉంటుందని చెబుతున్నా. ఈనెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తానని జగన్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com