దేవుడి దయ, ప్రజల దీవెనతో తాను విజయం సాధించినట్లు వైఎస్ జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ ఈ విజయం నాపై బాధ్యత, విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వనీయతను నమ్మి ప్రజలు ఓటు వేశారని, విశ్వనీయత లేని రాజకీయ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో చూపించి, తనకు ఇంత గొప్ప విజయం అందించారన్నారు. తనపై విశ్వాసం తో ప్రజలు ఓటు వేసి గెలిపించారని, ఆరు నెలల్లో గొప్ప పరిపాలన అంటే ఏంటో చూపిస్తానని ఆయన అన్నారు. ఐదు కోట్ల ఏపీ ప్రజల్లో నాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని, గొప్ప గవర్నెన్స్ అంటే ఎలాంటి ఉంటుందో చూపిస్తామని తెలిపారు. సంవత్సరంలోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అనిపించుకునేలా ప్రతి అడుగు వేస్తానని,తనపై విశ్వాసాన్ని ఉంచినందుకు ఏపీ ప్రజలందరికీ కృతజ్ఞతలు అని అన్నారు.
కాగా,ఏపీ సీఎంగా ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.