సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తొలి విజయం నమోదైంది. దమన్ దయ్యూలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 4,300ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్షా గుజరాత్లోని గాంధీనగర్ నియోజకవర్గంలో భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థిపై లక్షా పాతికవేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.