ఉత్తర్ ప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఒక 25 ఏళ్ల మహిళపై క్షుద్రపూజలు చేసే వ్యక్తి ఒకరు అత్యాచారం చేశాడని పోలీసులు చెపపారు. మద్నపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్తిపూర్లో ఈ ఘటన జరిగిందని వారన్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ప్రమోద్గా గుర్తించారు. బాధితురాలి అనారోగ్యాన్ని తొలగిస్తాననే నెపంతో ఆమె భర్తను దూరంగా పంపి, ఆమెను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని మద్నపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి మొహ్మద్ కాసిమ్ చెప్పారు. తిరిగి వచ్చిన తరువాత ఆ మహిళ జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పిందని, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు. కాగా అత్యాచారానికి ఒడిగట్టిన ప్రమోద్ గ్రామంనుంచి పారిపోయాడని అతడి కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు.