కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఫలితం ఎటూ తేలకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందన్నారు. ఈవీఎం మొరాయించి, వీవీ ప్యాట్ లెక్కల్లో తేడా వస్తే మిగతా లెక్కింపులో వ్యత్యాసం అతి తక్కువైతే రీపోలింగ్కు అవకాశం ఉందన్నారు. ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయమన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. మే 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.