హైదరాబాద్: ఎన్డీయే మిత్రపక్షాలకు ఇవాళ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో బీహార్ సీఎం, బీజేడీ నేత నితీశ్ కుమార్ పాల్గోనున్నారు. ఆయన ఇవాళ పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్సాహాంతో ఉన్న బీజేపీ నేతలు ఇవాళ మిత్రపక్షాలకు విందును ఏర్పాటు చేశాయి. బీజేడీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ నేతలతోనూ బీజేపీ టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.