ఉత్తరప్రదేశ్లో ఈవీఎం పెట్టెలను ఎటువంటి భద్రత లేకుండా ట్రక్కులో తరలిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. సుమారు నాలుగు చోట్ల ఇటువంటి సంఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిపై స్పందిస్తూ.. సరైన భద్రత మధ్యే, ప్రోటోకాల్ ప్రకారమే ఈవీఎంలను తరలిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. అన్ని ఈవీఎంలు, వీవీప్యాట్లను సరైన రీతిలోనే సీల్ చేశామని, రాజకీయ పార్టీల సమక్షంలోనే సీలింగ్ జరిగిందని, వీడియో కూడా తీశారని, సీసీటీవీ కెమెరాలను కూడా ఇన్స్టాల్ చేశామని ఈసీ అధికారులు వెల్లడించారు.