తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏపీ భవన్ లో చంద్రబాబుతో న్యాయవాది అభిషేక్ మనుసింగ్వీ సమావేశమయ్యారు. ఈసీ ముందు లేవనెత్తాల్సిన అంశాలపై న్యాయవాది చంద్రబాబుతో చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా ఈసీ వైఫల్యాలు తెలిపేలా ఉన్న వీడియోలను ఈసీ ముందుంచనున్న విపక్షాలు ఈసీకి అందించాల్సిన నివేదికను చంద్రబాబు సిద్దం చేస్తున్నారు.