న్యూఢిల్లి : మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, యుపిఎ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఆయన కుమారుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆయనకు నివాళులర్పించారు. ఢిల్లిలో వీర్భూమిలోని రాజీవ్ గాంధీ సమాధి వద్ద వారు నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్కు నివాళులర్పించారు.