తిరుమల : ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజకీయ నేతల తాకిడి బాగా ఎక్కువవుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి కాల్వ శ్రీనివాసులుకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.