ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేజ్ ప్రతాప్ అనుచరుల వీరంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2019, 02:24 PM

సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో భాగంగా ఈరోజు 59 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బిహార్ లోని పట్నాలో జేఎన్ఎన్ పార్టీ అధినేత, లాలూకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అనుచరులు రెచ్చిపోయారు. కారు విండ్ స్క్రీన్ ను విరగ్గొట్టాడని ఆరోపిస్తూ ఓ కెమెరామెన్ ను చితక్కొట్టారు. పట్నాలోని వెటర్నరీ కాలేజీలో ఓటువేసిన తేజ్ ప్రతాప్ తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై తేజ్ ప్రతాప్ మరో వాదన వినిపించారు. పోలింగ్ కేంద్రం వద్ద మీడియా ముసుగులో కొందరు తనను చంపేందుకు ప్రయత్నించారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. ఈ ఘటనలో తన కారు అద్దం పగిలిపోయిందనీ, గాజు ముక్కలు తమ డ్రైవర్ కంట్లోకి దూసుకెళ్లాయని వెల్లడించారు. ఈ వ్యవహారంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. తనపై దాడి జరగడంతో తన భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారని స్పష్టం చేశారు. చివరి విడతలో భాగంగా ప్రస్తుతం బిహార్ లోని 8 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com