ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లిలో పర్యటిస్తున్నారు. ఎన్డీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా బీజేపీయేతర పార్టీల నేతలతో చంద్రబాబు భేటీలు అవుతున్నారు. ఉదయం రాహుల్ గాంధీ, శరత్పవార్లతో సమావేశమైన చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం కాంగ్రెస్ నేత కపిల్సిబత్తో భేటీ అయ్యారు. వివిధ పార్టీల నేతల అభిప్రాయాలు, ఫలితాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఏఐసీసీ ఛైర్పర్సన్ సోనియాగాంధీతో చంద్రబాబు భేటీ కానున్నారు.