చిత్తూరు జిల్లా చంద్రగిరిజరుగుతుండగా నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్ లో మరో అరెస్ట్ జరిగింది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, ఆయన భార్య సుధారెడ్డి పులివర్తివారి పల్లి పోలింగ్ కేంద్రం వద్ద నిరసనలకు దిగగా పోలీసులు సర్దిచెప్పారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వైసీపీ ఏజెంట్ తో గొడవకు దిగడంతో ఎన్నికల అధికారులు నానిపై కేసు నమోదు చేయించారు. ఇప్పుడు తాజాగా కమ్మపల్లి పోలింగ్ కేంద్రం వద్ద మునిస్వామి నాయుడు అనే వ్యక్తి ఓ వృద్ధురాలికి సహాయకుడిగా వెళ్లి ఓటు వేశారని పోలీసులు అరెస్ట్ చేశారు.