చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఏడు పోలింగ్ కేంద్రాలలో భారీ కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య రీపోలింగ్ కొనసాగుతుంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, చంద్రగిరి, కుప్పంబదురు, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురం, కాలేపల్లి కేంద్రాలలో ఎన్నికలు జరుగుతుండగా మధ్యాహ్నం 12 గంటలకు 42.23 శాతం పోలింగ్ జరిగింది.