అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు చోట్ల రీపోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఒక్కో రీపోలింగ్ కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కేంద్రాల వద్ద ఘర్షణలు జరిగాయి. రీపోలింగ్ సందర్భంగా టీడీపీ అభ్యర్థి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. చెవిరెడ్డి బావ కేశవులురెడ్డిపై పులివర్తి నాని దాడి చేశాడు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సహా అనుచరులపై పాకాల పీఎస్లో కేసు నమోదైంది. వైసీపీ ఏజెంట్తో టీడీపీ అభ్యర్థి నాని వాగ్వాదానికి దిగాడు. పోలీసులు అడ్డుకొని అతనిపై కేసు నమోదు చేశారు.