ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరద్ పవర్ తో ముగిసిన చంద్రబాబు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2019, 12:23 PM

ఢిల్లీ:  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శరద్ పవర్ ఈరోజు మరోసారి భేటీ కాగా కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. గత మూడు రోజులుగా ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్న బాబు దాదాపు అరగంట సేపు శరద్ పవర్ తో చర్చలు జరిపారు. నిన్న అఖిలేష్ యాదవ్, మాయావతిలో జరిపిన చర్చలలో అంశాలపై కాసేపటి క్రితమే రాహుల్ గాంధీతో చర్చించిన బాబు అక్కడ నుండి శరద్ పవర్ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం అఖిలేష్, మాయావతితో చర్చించిన అంశాలను బీజేపీయేతర పక్షాల కూటమిలో ఉన్న ఇబ్బందులు, తదుపరి కార్యాచరణ గురించి శరద్ పవర్ తో చర్చించారు. కాగా ఈ సాయంత్రం ఏఐసీసీ చైర్ పర్సన్ సోనియా గాంధీతో కూడా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తుండగా ఈ భేటీలో రాహుల్ కూడా పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com