తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్, త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేబ్, ఏపీ మంత్రి దేవినేని ఉమలు వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి దేవినేని ఉమ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ ఈ నెల 23న విడుదలయ్యే ఫలితాల్లో టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.