తిరుపతి: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు శక్తికాంతదాస్కు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన గవర్నర్.. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఎప్పుడు వచ్చినా ఏదో తెలియని అనుభూతి కలుగుతుందని, స్వామి వారి దయతో ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నానని తెలిపారు.