ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. నిన్న శనివారం పలువురు నేతలతో చంద్రబాబు జరిపిన చర్చల గురించే ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం కాగా ముఖ్యంగా అఖిలేష్ యాదవ్, మాయావతితో బాబు జరిపిన చర్చల వివరాలను రాహుల్ తో చర్చించారు. ఇక తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాలని ఈ ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుండగా బాబు కాసేపటిలో శరద్ పవర్ తో మరోసారి సమావేశం కానున్నారు.