తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని 7 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 5,451 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రీ పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మక ప్రాంతాలైన ఎన్.ఆర్.కమ్మపల్లి, కాలేపల్లి, కుప్పం బాదూరు కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు.