తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ హిమాచల్ప్రదేశ్ వెళ్తున్నారు. మూడు రోజులపాటు ఆయన అక్కడే ఉంటారు. ఎన్నికలు ప్రచారం, ఈవీఎంలపై పోరాటంతో బిజీబిజీగా గడిపిన బాబు.. కాస్త సేదతీరేందుకు హిమాచల్ ప్రదేశ్ వెళుతున్నారు. తిరిగి సోమవారం ఆయన అమరావతి చేరుకుంటారు.