ప్రధాని నరేంద్ర మోదీ పై రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పోటీచేస్తున్నట్టు వస్తున్న వార్తలను పటా పంచలు చేస్తూ వారణాసి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గా అజయ్ రాయ్ ని ప్రకటించింది. గత ఎన్నికల్లో మోదీని ఎదుర్కొన్న అజయ్ రాయ్నే కాంగ్రెస్ మళ్లీ బరిలో నిలిపింది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇషయం తెలిసిందే. అజయ్ రాయ్ స్థానికుడు కావడం, రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఆయనవైపే పార్టీ మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అయితే ప్రధాని మోడీని ఇక్కడ ఢీకొనటం ఆషామాసీ విషయం కాదని అయినప్పటికి తనవంతు ప్రయత్నం చేస్తానని, గతంలోని మెజార్టీని కచ్చితంగా తగ్గించగలనన్న నమ్మకం తనకుందని అజయ్ రాయ్ మీడియాకు చెప్పారు.