ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 27న మహాసంప్రోక్షణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2019, 11:50 PM

తిరుమ‌ల‌లోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో  శాస్త్రోక్తంగా అష్ట‌బంధ‌నం స‌మ‌ర్ప‌ణ పూర్తి కావ‌టంతో         ఏప్రిల్ 26న శుక్ర‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారికి మ‌హాశాంతి పూర్ణాహుతి, తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాల‌లో భాగంగా శ‌య‌నాధివాసం చేప‌డ‌తారు.


 ఏప్రిల్ 27న ఉదయం 11.07 నుండి మ‌ధ్యాహ్నం 1.16 గంట‌ల వ‌ర‌కు మహాసంప్రోక్షణ జ‌రుగనుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వ‌రాహ‌స్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com