ఆంధ్రప్రదేశ్లో రీపోలింగ్పై కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం రావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్కు 21 వేల మంది సిబ్బంది అవసరమని తెలిపారు. అసెంబ్లీ, లోక్సభ పరిధిలో ఐదేసి కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. ముందుగా పోస్టల్, సర్వీసు ఓటర్ల లెక్కింపు చేస్తామని సీఈవో తెలిపారు. కౌంటింగ్ టేబుళ్ల పెంపు కోసం.. విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని ద్వివేది వెల్లడించారు.