గుంటూరు:జిల్లాలోని మాచర్లలో దారుణం చోటుచేసుకంది. ఏడేళ్ల సాత్విక్ అనే బాలుడ్ని దారుణంగా చంపి క్వారీలో పడేశారు. ఈనెల 22న కిడ్మాప్ అయిన సాత్విక్ను హత్యచేయటం జరిగింది. నెహ్రునగర్లో బాలుడు సాయి కిడ్నాప్ అయిన విషయాన్ని.. రైల్వే స్టేషన్లోని సీసీ టీవి పుటేజ్ ఆధారంగా మాచర్ల పోలీసులు గుర్తించారు. మాచర్ల సమీపంలో ఓ క్వారీలో బాలుడి మృతదేహాన్ని ఉందని తెలుసుకున్నారు. కన్న బిడ్డ మరణవార్త తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.