సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన విపక్షాలు ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించటంపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేనివారే ఇలాంటి ప్రకటనలు చేస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ప్రధాని మోదీకి ఉందా లేదో తెలపాలని అన్నారు. ఓటు హక్కు సద్వినియోగం గురించి విశ్వాసం లేని నియంతృత్వం ధోరణి వంటివారు ఇలాగే తమాషాగా మాట్లాడతారని అన్నారు.