ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీ వెళ్లారు... ఆయనతో పాటు ఐఏఎస్ అధికారులు కరికాల్ వలవన్, అనంతరాములు కూడా హస్తినకు పయనమయ్యారు. వీరంతా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు హాజరయ్యేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారాలపై గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు విచారణ నేపథ్యంలో అధికారులు ఢిల్లీ వెళ్లారు. ఇక, ఇప్పటికే రాష్ట్రంలో సీఎం చంద్రబాబు వర్సెస్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అనే స్థాయికి పరిస్థితి వెళ్లిపోగా.. ఈ నేపథ్యంలోనే సీఎస్.. హస్తినకు వెళ్లడంపై తీవ్రస్థాయిలో చర్చసాగుతోంది. ఎన్నికల కమిషన్, సీఎస్.. పాలనకు ఆటంకం కలిగిస్తున్నారనే ఇప్పటికే సీఎం, మంత్రులు మండిపడుతున్న సంగతి తెలసిందే.