సార్వత్రిక ఎన్నికలు కాగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉండాలని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. ఇంటర్ పరీక్షలపై తెలంగాణ సీఎం సమీక్ష పెడితే ఎవరూ నోరు మెదపరని అన్నారు. ఇక్కడ మనం ఏదైనా సమీక్షపెడుతుంటే నానా యాగీ చేస్తున్నారన్నారు. ఈసీ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు మాత్రమే పనిచేయాలన్నారు. మిగిలిన వాళ్లు ప్రభుత్వం కిందే పనిచేయాలన్నారు.