న్యూఢిల్లి : లోక్సభకు 4వ దశలో జరుగనున్న ఎన్నికల్లో నేడు పలు పార్టీల నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి రెండు ర్యాలీలలో పాల్గొంటారు. ఉత్తర్ ప్రదేశ్లోని షాజహాన్పూర్, కన్నౌజ్లలో జరిగే ర్యాలీలలో మాయావతి పాల్గొంటారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్రలోని పింప్రి చించ్వాద్లో జరిగే ర్యాలీలో పాల్గొంటారు.