అన్నవరం: ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి విడత పోలింగ్ జరిగే స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి ఈ నెల 24 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈ నెల 25న నామినేషన్ల పరిశీలన, 26న అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. మే 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు పోలింగ్ జరగనుంది