ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు చంద్రబాబు క్లాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2019, 10:57 AM

మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా, ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చే 17-సి ఫారాలు, ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు, మొత్తం ఓట్ల వివరాలు తెలియజేసే ఇ-ఫారాలపై అభ్యర్థులకు ముందుగానే అవగాహన కలిగించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 


ఈ ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో తమ పాత్ర ఎలా ఉండాలన్న దానిపైనా చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో చర్చించనున్నారు. ఈ కీలక సమావేశానికి టీడీపీ అగ్రనేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ హాజరవ్వాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com