ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనను ఖండించిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2019, 06:04 PM

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ పండుగ సందర్భంగా ఉగ్రవాదులు మారణహోమం సృష్టించడం పట్ల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి రక్త హింసను ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు తన సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి మతిలేని మూర్ఖ చర్యలకు సమాజంలో తావులేదని జగన్ స్పష్టం చేశారు.

ఈస్టర్ సందర్భంగా ప్రార్థనామందిరాల్లో దైవ ప్రార్థన చేసుకుంటున్న క్రైస్తవులపై ఆత్మాహుతి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 185 మంది వరకు మరణించినట్టు సమాచారం. వందల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ దాడులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటనలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com