ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీకి ఇవే చివరి ఎన్నికలు కావాలి: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2019, 04:54 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మోదీ మూర్ఖత్వంగా ప్రత్యర్థులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మోదీ ఎన్నో హామీలు ఇచ్చారని అయితే అందులో ఒక్కటి కూడా అమలుచేయలేదని విమర్శించారు. అలాంటి మోదీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కర్ణాటకలోని తెలుగు సెటిలర్లతో చంద్రబాబు అన్నారు.


   కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా సింధనూరు క్లబ్‌ కాకతీయలో సెటిలర్లతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రులు ప్రపంచంలో ఎక్కడైనా సత్తా చూపించగలరని, ప్రవాసాంధ్రుల కృషితో కర్ణాటక ధాన్యగారంగా పిలవబడుతోందని హర్షం వ్యక్తం చేశారు. తుంగభద్ర నీరు ఆంధ్రా-కర్నాటకకు సమానంగా అందేలా కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com