ఇటీవలే పాక్ సైన్యానికి చిక్కి దిగ్విజయంగా తిరిగి భారత్ కు వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను శ్రీనగర్ ఎయిర్ బేస్ నుంచి మరో ఎయిర్ బేస్ లోకి ఆయనను బదిలీ చేశారని వార్తలు వస్తున్నాయి.
ఆయన భద్రత విషయమే ఈ బదిలీకి ముఖ్య కారణం అని సమాచారం. అభినందన్ కశ్మీర్ వ్యాలీలో వర్క్ చేయడం కన్నా మరో చోట అయితే ఆయన కూడా సేఫ్ గా ఉండే అవకాశం ఉందని ఆయనను బదిలీ చేశారని తెలుస్తొంది. , ఆయన అక్కడ కూడా ఫ్లైయింగ్ డ్యూటీస్ లోనే ఉండబోతున్నారని వినిపిస్తతోంది.
ఒక పాక్ యుద్ధ విమానాన్నికూల్చిన అనంతరం తను నడుపుతన్న యుద్ధ విమానంకూడా కూలి పోవడంతో అభినందన్ పాక్ లో దిగిన సంగతి తెలిసిందే. అక్కడ స్థానికులు అభినందన్ ను పట్టుకుని కొట్టి పాక్ సైన్యానికి అప్పగించారు అనంతరం ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాక్ అభినందన్ ను భారత్ కు అప్పగించింది. కొంత కాలం విశ్రాంతి అనంతరం అభినందన్ తిరిగి ఎయిర్ ఫోర్స్ లో చేరారు. ఈ పరిస్థితుల్లో ఆయనన బదిలీ జరిగింది.