అమరావతి : ఎపి శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు కాసేపట్లో గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్తో ఆయన భేటీ కానున్నారు. ఎన్నికల రోజున గుంటూరు జిల్లా ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలో తనపై జరిగిన దాడి.. తదనంతర పరిణామాలను గవర్నర్కు ఆయన వివరించే అవకాశముంది. నరసింహన్ను కలిసిన అనంతరం కోడెల మీడియాతో మాట్లాడనున్నారు.