ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని హైదరాబాద్లో ఎంసెట్ పరీక్ష నేడు ప్రారంభమైంది .ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ఏపీ ఎంసెట్-2019 ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లో కేటాయించిన సమయం కంటే గంట ముందుగా పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని చెప్పారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,723 మంది, వ్యవసాయ- వైద్య విభాగంలో 86,910 మంది కలిపి మొత్తం 2,82,633 మంది దరఖాస్తుదారులు ఈ ప్రవేశ పరీక్ష ఆన్లైన్లో రాయనున్నారని చెప్పారు. 115 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.